జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించిన ఉరవకొండ జనసేన నాయకులు

ఉరవకొండ

     ఉరవకొండ, (జనస్వరం) :   ఉరవకొండ మండల పరిధిలోని పెన్నోబిలములో  వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్  గారు దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసైనికులు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన యొక్క భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు సైనికులుగా శక్తివంచన లేకుండా పనులు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటాలు చేస్తుందని, ప్రజలలో నమ్మకం తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్, విజయ్, యుగంధర్,అజయ్, మల్లికార్జున, రాజేష్, ఓబులేసు, విశ్వనాధ్, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి ఆశయ పోరాట స్ఫూర్తి కి ఆకర్షితులై పశ్చిమ జనసేనలో భారీ చేరికలు