ఎచ్ఛర్లలో కరోనా ఫ్రంట్ వారియర్స్ కు కరోనా కిట్స్ అందజేత, వారికి సన్మానం చేసిన జనసేన నాయకులు

ఎచ్చర్లలో  కరోనా ఫ్రంట్ వారియర్స్ కు కరోనా కిట్స్ అందజేత, వారికి సన్మానం చేసిన జనసేన నాయకులు

     ఎచ్చర్ల నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు లో 4వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ కరోన కష్ట కాలంలో సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్ వారియర్స్ కు  రణస్థలం మండలం మరియు జి. సిగడాం లో ఉన్న పోలీసు సిబ్బందికి నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి శ్రీ క్రాంతి శ్రీ గారు మరియు చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు విశ్వక్సేన్ చేతులు మీదుగా సన్మానించి, వాళ్లకు మిఠాయిలు మరియు మాస్కులు, శానిటైజర్స్ ను పంపిణీ చేయడం జరిగింది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మా యొక్క సేవలను గుర్తించినందుకు జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రణస్థలం నుంచి రాజాం వెళ్లే రహదారి లో నిమ్మల వలస పెనసం మధ్యలో ఉన్న వంతెన నిర్మాణం చాలా రోజుల నుండి ఆగిపోయిన సమస్యను క్రాంతి శ్రీ గారు దృష్టికి తీసుకువచ్చారు.  ఆమె వెంటనే వంతెన సందర్చించి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీర మహిళ పొట్నూరు రవనమ్మ , మీసాల రవికుమార్, బాలి అప్పలనాయుడు , తాలబత్తుల పైడిరాజు ,లక్ష్మీనాయుడు, శంకర్, సింహాచలం, సాయి, శివ ,శంకర్, దుర్గారావు, బాబాజీ, శ్యామ్, సంతు, వాసు, కృష్ణ, తిరు, మనోజ్, జయప్రకాష్, నూకరాజు, ఈశ్వర్, సాయి మరియు, గ్రామ ప్రజలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించిన జనసేన నాయకులు హుసేన్ ఖాన్