పవన్ కళ్యాణ్ గారి చిత్రా పటానికి పాలాభిషేకం చేసిన జనసైనికులు

పవన్ కళ్యాణ్

          ఆత్మకూరు ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థను మొత్తాన్ని తప్పు పట్టలేదని, వ్యవస్థలో కొంతమంది చేసే పనులను మాత్రమే చెప్పారని అన్నారు. అలాగే వాలంటీర్లుగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ల సైతం అయిదు వేల రూపాయల కోసం వాలంటీర్ జాబ్ చేస్తున్నారన్నారు. అంటే రోజు కు 166 రూపాయలు తో 10 గంట లు చాకిరీ పని చేయడం దారుణమని, వారికి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని  పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్ప కొంతమంది వైసీపీ నాయకులు కావాలని వాలంటీర్లను కించపరచారని దుమారం రేపడం సరికాదన్నారు. వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర పన్నినట్టు తెలుస్తుంది అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులుశ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ కరిముల, మంగు దొడ్డి హరి కృష్ణ నాగభూషణం, వెంకట్ రమణ, పెనగలురు చిన్నయ్య, గల్ల నాగ రాజు, అజయ్ తదితర పాల్గొనడం జరిగింది.

See also  రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుటుంబానికి న్యాయం చేయండి : ఆళ్లగడ్డ జనసేన పార్టీ నాయకులు డిమాండ్