ఎస్‌ఐ గారికి పూలమొక్కను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

కళ్యాణదుర్గం

    కళ్యాణదుర్గం, ( జనస్వరం) : కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ తరపున జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సుధాకర్ గారికి పూలమొక్కను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ గారు మాట్లాడుతూ  స్టేషన్ అవరణంలో ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుతామని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజాసమస్యల పరిష్కారం కోసం చాలా బాగా కృషి చేస్తున్నారు అని ఎస్సై గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ ఆంజనేయులు గారు, కుందుర్పి మండలం కన్వీనర్ జయకృష్ణ గారు, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన నాయకులు జాకీర్, సాయి, సయ్యద్ మహబూబ్, పవన్,అనిల్, శ్రీనివాసులు, లోకేష్, నీలకంఠ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  కదిరి టౌన్ 34వ వార్డు నందు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం