
అనంతపురం, డిసెంబర్ 23, (జనస్వరం) : అగంతకుడి దాడిలో కత్తిపోటుకు గురైన అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. నగరంలోని సీఐ శ్రీకాంత్ స్వగృహానికి వెళ్లిన జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు, వాల్మీకి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకే ఈశ్వరయ్య ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, నూర్ బాషా/దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఇమామ్ హుస్సేన్ కూడా హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్ త్వరగా కోలుకొని మళ్లీ యధావిధిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని వారు కోరారు.









