జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ ను సన్మానించిన సీతానగరం జనసైనికులు

జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ ను సన్మానించిన సీతానగరం జనసైనికులు

                        జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా అత్యుత్తమ సేవలు అందిస్తున్న మన Dr. జగన్ గారికి(సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ) మరియు Dr. నీలిమా గారికి (పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వీరి ఇరువురికి జనసేనాని ఆకాంక్ష మేరకు  బుధవారం నాడు మధ్యాహ్నం 12:00గంటలకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంని మండల జనసైనికులు అధ్యక్షత వహించి ముందుగా జనసేన అధ్యక్షులు వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మన మండలంలో ఇలాంటి గొప్ప డాక్టర్స్ ఉండడం మన అదృష్టం అని, కరోనా కష్టకాలంలో వీరు చేసిన సేవలు మరువలేనివి అని జనసేనాని స్పూర్తితో ఇలాంటి వ్యక్తులకు సన్మానం చెయ్యడం మా అదృష్టంగా బావిస్తున్నాం వీరి ఇరువురికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువేనని పేర్కొన్నారు. 

                  అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్ గారు మాట్లాడుతూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము చేసిన సేవను గుర్తించి సన్మానం చేసినందుకు, ఇలా సమాజానికి సేవ చేస్తున్న మా తోటి వారికి కూడా ఈ సన్మానం అంకితం అని పేర్కొన్నారు. అలాగే డాక్టర్ నీలిమా గారు మాట్లాడుతూ మేము చేస్తున్న సేవలు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. మమ్మల్ని గురించి సన్మానం చెయ్యడం వలన మాకు ఎంతో ప్రోత్సహంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు శివశంకర్ పోతల అల్లు రమేష్, పైలా సత్యనారాయణ, రెడ్డి మణికంఠ, సూర్యనారాయణ, వెంకటరమణ, అరవింద్,సోమేశ్, నాగేశ్వరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

See also  ఉండ్రాజవరం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు