మడకశిర మండలంలో యువకులు జనసేన పార్టీలోకి చేరికలు

మడకశిర

                మడకశిర ( అనంతపురం ) : మడకశిర మండలం ఆమిదాలగొంది పంచాయతీ నుండి 35 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరారు. పల్లెపల్లెలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే నెపంతో పార్టీలోకి చేరికల మీద దృష్టి  పెట్టామని మండల అధ్యక్షుడు టి. శివాజీ అన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం దిశగా మడకశిర మండలంలోని అన్ని పంచాయతీలో 2024వ సంవత్సరంలో జనసేన పార్టీ జెండా ఎగిరే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంతవరకు కష్టపడి గెలుపే ధ్యేయంగా ప్రతి జన సైనికుడు పోరాడాలని కొత్తగా పార్టీలోకి చేరిన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొనడం జరిగింది. 

See also  ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలి