ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలి

– మైలవరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ)
        ఇబ్రహీంపట్నం, (జనస్వరం)  : ఇటీవల కృష్ణా నది వరద ప్రవాహానికి ముప్పుకు గురైన కొటికలపూడి, దామలూరు, చిలుకూరు, మూలపాడు, కేతనకొండ గ్రామాలకు చెందిన రైతులను కలసి వారితోపాటు పంట నష్టం వాటిల్లిన పొలాలను మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంవాటిల్లిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతలక్ష్మీ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, కొటికలపూడి గ్రామ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్, కళ్యాణ్, కొమ్మూరు వెంకటస్వామి, బాల, కొమ్మూరి హనుమంతరావు, ఎతి రాజుల ప్రవీణ్, సుజాత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

See also  గడప గడపకు ప్రదక్షిణలు చేసినా కూడా ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు గెలవరు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి