వేలకోట్ల ప్యాలెస్ లు ఉన్న పేదవాడు ఎవరు? అధికార మదంతో ఉన్న పెత్తందారు ఎవరు?

పెత్తందారు

       పుట్టపర్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రిలీజ్ చేసిన పోస్టరు ద్వారా పేదలకు పెత్తందాలకు మధ్య యుద్ధం అని పెట్టాడు. ఇందులో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా అందులో ఉంచారు. హిందూపురం పట్టణంలో దీనిని బ్యానర్ వేసి జనసేన నాయకులను జనసైనికులను రెచ్చగొట్టేలా చేశారు. ఈ సందర్బంగా హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి ఐన మా నాయకులు ఆకుల ఉమేష్ గారు స్పందించి అధికారులకు తెలియపరచడం జరిగింది. అక్కడ వారు తేసివేయకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానులే దానిని తీసేశారు. అక్కడ ఉన్న నాయకులు అధికార మదంతో మా నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఉండగానే వందమంది దాకా వెళ్లి పోలీసులపై దుర్భాషలాడి జనసేన నాయకుల్ని కొట్టడానికి వెళ్లారు. దీనిని జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం తరఫున ఖండిస్తున్నామన్నారు.  ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేలేదు కాబట్టే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తున్నారు. పేదలైన ప్రజలకు పెత్తందారులైన మీకు జరుగుతున్న యుద్ధమిది వచ్చే ఎన్నికలలో మీకు బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నామని తెలియజేశారు. 

See also  బాలసౌరితో జనసేన నాయకుల ఆత్మీయ కలయిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి