
స్థానిక సమస్యలను, రహదారులను పట్టించుకోవాలని ఎంపిడిఓ గారికి వినతి పత్రం అందించిన హిర జనసైనికులు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం, మేజర్ పంచాయతీ ప్రధాన కూడలిలో ఉన్న sbi బ్యాంకు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఉన్న రహదారి ఎక్కడికక్కడే గుంతలతో రాళ్లు తేలిపోయి ప్రయాణానికి ఇబ్బందిగా అధ్వానంగా ఉందని స్థానిక ప్రజలు” పాతపట్నం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అయినా శ్రీ గేదెల చైతన్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే చైతన్య గారు స్పందిస్తూ మండల నాయకులు అయిన కొండాడ సురేష్ గారు కి సమస్యను చెప్పి, పట్టు సాయితో పాటు తోటి జనసైనికులతో స్థానిక ఎంపిడిఓ గారికి , మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.








