
అమరావతి, (జనస్వరం) : బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసేన పార్టీ తరఫున బిజెపీకి సహాయ సహకారాలు అందించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో శ్రీ తాతంశెట్టి నాగేంద్ర (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ ముకరం చాంద్ (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ సుంకర శ్రీనివాస్ (కడప అసెంబ్లీ పార్టీ ఇంఛార్జ్) ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.








