అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన NRI సేవా సమితి కువైట్ విభాగం

జనసేన NRI సేవా సమితి కువైట్

          మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి పట్టణానికి చెందిన నాయ్ని లోకేష్ బాబు ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత చిరు ప్రయత్నంగా ఆదుకోవాలని, అతని మందుల ఖర్చులకు సహాయపడాలని జనసేన NRI సేవా సమితి కువైట్ వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి తక్షణ సహాయంగా 15,000/- నగదు మొత్తాన్ని లోకేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. దారం అనిత గారు మాట్లాడుతూ విదేశాలలో ఉంటూ సహాయం అని తెలియగానే స్పందించే జనసేన NRI సేవా సమితి కువైట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా 30 రోజుల్లో 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలను గుర్తూ చేస్తూ, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా దాతలు రామ్ రంగా, శ్రీకాంత్ బీనేని, మలిశెట్టి మల్లికార్జున, సాయిలకు  ధన్యవాదములు తెలియజేశారు.

See also  విద్యార్థులకు స్టేషనరీ అందించిన పిఠాపురం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి