సింగరేణి కార్మికుల మృతి బాధాకరం : జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్

    తెలంగాణ, (జనస్వరం) : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సింగరేణి SRP3 బొగ్గు గనిలో మొదటి షిఫ్ట్‌ నిర్వహిస్తుండగా పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు అనే వార్త నన్ను చాలా బాధకి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకి జనసేన పార్టీ తెలంగాణ తరపున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారితో పాటు పనిలో ఉన్న మిగతా కార్మికులకి గాయాలు అయ్యాయి. వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ జనసేనపార్టీ తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

See also  ప్రజా సమస్యల పరిష్కారానికై ఒంగోలులో జనంలోకి జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి