
శింగనమల, (జనస్వరం) : వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా బుక్కరాయసముద్రంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ పూలమాలలతో సత్కరించి టెంకాయ కర్పూరంతో పూజించటం జరిగింది. ఈ వాల్మీకి మహర్షి పుట్టినరోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి, కుటుంబ విలువలకు చిహ్నంగా రామాయణం అనే మహా కావ్యాన్ని తెలిపి పండుగలా ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్న అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గం నశించాలన్న మనకు ఈ వాల్మీకి మహర్షి పండుగ చాలా అవసరమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, మన్నల పెద్దిరాజు, వాల్మీకి మునీంద్ర, వాల్మీకి రామకృష్ణ, తలారి ధనుంజయ, వాల్మీకి రాజు, తాహిర్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.








