జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు గారి సమక్షంలో పిఠాపురం టీడీపీ నాయకులు పార్టీలోకి చేరికలు

జనసేన

        పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పీఏసీ సభ్యులు నాగేంద్రబాబు గారు రాజమండ్రి పట్టణానికి విచ్చేశారు.  పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి సమక్షంలో పిఠాపురం టౌన్ పట్టణ నాయకులు పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణం చిన్నారావు, వైయస్సార్ సి.పి పార్టీ మాజీ కౌన్సిలర్ వేణుం నారాయణ రావు, పి రాయవరం మాదేపల్లి పద్మరాజుకి  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాగబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకోసం, జనసేన సిద్దాంతాల కోసం పాటు పడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. 

See also  జనసేనపార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు శ్రమించాలి : రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ శ్రీ సత్యనారాయణ