పొందూరు మండల గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

    ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, తానేం గ్రామంలో జనసేనపార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు, దోమలు, రోగాలు తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ జనసేనపార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల జనసేనపార్టీ నాయకులు చిన్నమనాయుడు, బాబురావు, సురేష్, సూర్య, రమణ, గోపి, ,సిమ్మి నాయుడు, చిన్న, రామకృష్ణ, సింహాచలం, పెద్ద ఎత్తున గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  స్కూల్ పిల్లల టాబ్ లలో జగనన్న స్కామ్ : కేతంరెడ్డి వినోద్ రెడ్డి