
పెద్దాపురం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం శాంతియుత ధర్నా..
కేంద్రం బి.జె.పి నరేంద్ర మోడి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన 20 లక్షల ఇళ్ళ పై జరిగిన అవినీతి పై ఈ రోజు బీజేపీ – జనసేన సంయుక్త నిరసన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉదయం 10 గంటలకు వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనసేన పార్టీ బిజెపి ఆంధ్ర సంయుక్త ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరగింది. పెద్దాపురం నియోజకవర్గం వీరమహిళ శ్రీమతి సుంకర కృష్ణవేణి మాట్లాడుతూ..రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు పేదవాడి ఇంటికోసం జనసేన,బీజేపీ పోరు బాట ఇందుకు గానూ రాష్ట్ర జనసేన,బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 20 లక్షల ఇళ్ల పైన జరిగిన అవినీతిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, లబ్ధిదారులకు ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని, పూర్తయినా ఇళ్లను వెంటనే లభ్దిదారులకు అప్పగించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చెయ్యడం జరిగింది. జనసేన,బీజేపీ కార్యకర్తలు సామాజిక దూరం వహిస్తూ మాస్కులు ధరించి ఇళ్ళలోనే ఉ 10గం నుండి మధ్యాహ్నం 12గం వరకు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వీరమహిళ సుంకర కృష్ణవేణి,జనసైనికులు శ్రీనివాస్,నక్కామణికంఠ,తోలేటి సాయి నిరసన ధర్నా లో పాల్గొనడం జరిగింది..









