గ్రామాల్లో పర్యటిస్తున్న పాలకొండ జనసేన నాయకులు

పాలకొండ

            పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం, కీమ్మి గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్ర లో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారని అన్నారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్ధులతో మాట్లాడుతూ సామాన్యులకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని ఆయన అన్నారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి భావితరాల భవిష్యత్ కు శ్రీకారం చుట్టాలని ప్రజలకు వృద్ధులకు యువతకు ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

See also  జర్నలిస్టుల కాలనీలో అక్రమణలు తొలగించాలి : జనసేన నాయకులు గురాన అయ్యలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి