
ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించండి : జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ
రాష్ట్రంలో గత కొద్ది కాలంగా హిందూ దేవాలయాలు పైన.. హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అంతర్వేదిలో జరిగిన రథం దగ్ధం ఘటనను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ.. జనసేన పార్టీ వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రకటన చేసి సిబిఐ దర్యాప్తుకు కోరనున్నట్లు గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరించి వేస్తోంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలపాలని అనుకున్న నన్ను బుధవారం ఉదయం 6 గంటల నుండి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దాడుల ఘటనలను అడ్డుకోలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం విపక్ష నేతలను నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు అద్దం పడుతుంది. ప్రజాస్వామిక దేశంలో ప్రజలు తమకు అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలిపే హక్కును కూడా ఇక్కడ హరించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండించాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనసేన పోరాటాన్ని కొనసాగిస్తుందని జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ గారు అన్నారు.








