కిడ్నీ వ్యాధితో బాధపతున్న జనసైనికునికి రూ. 50 వేల సహాయం చేసిన NRI పిట్టా మూర్తిగారు

కిడ్నీ వ్యాధితో బాధపతున్న జనసైనికునికి రూ. 50 వేల సహాయం చేసిన NRI పిట్టా మూర్తిగారు  

     విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం రూరల్ అధ్యక్షుడు చిరంజీవి యువత జాజుల రమణ బాబు గారికి అనారోగ్యం కారణంగా కిడ్నీ మరియు కరోనా వ్యాధితో 20 రోజులగా బాధపడుతున్నాడు. వైజాగ్ అరిలోవ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం  తెలుసుకున్న జనసైనికులు వారి కుటుంబానికి జనసేన నాయకులు NRI పిట్టా మూర్తి గారు 50వేలు ఆర్థిక సహాయం చేసారు. గతంలో కూడా పిట్టా మూర్తి గారు తొర్రి ప్రసాద్ కి కూడా 20 వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆయనకి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. అనునిత్యం కష్టాల్లో ఉన్న వారికి ఆయనకి తగినంత లో సహాయం చేస్తున్న మన NRI పిట్టా మూర్తి గారికి నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు, చిరంజీవి మెగా అభిమానులు తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని స్థానిక జనసైనికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  అచ్చుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలి : విశాఖ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి