నషా ముక్త భారత్ పోస్టర్ ను విడుదల చేసిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

డ్రగ్స్ రహిత సమాజానికి- నషా ముక్త భారత్.

నరసరావుపేట, ఆగస్ట్ 06( జనస్వరం)

భారతదేశాన్ని మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ కు దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప జాతీయ ఉద్యమంలో భాగంగా బ్రహ్మకుమారి సభ్యులు మన నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ని కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించినాము.ఎన్జీవో కాలనీలో ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న ప్రజల చేత ప్రమాణం చేయించడం జరిగినది. నషాముక్త భారత్ యొక్క పోస్టర్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు విడుదల చేశారు. ఈ మహా ఉద్యమంలో పాలు పంచుకుంటున్న బ్రహ్మకుమారి సంస్థ సభ్యులను మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులను శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రత్యేకముగా తమ సహకారాన్ని అందిస్తామని చెప్పియున్నారు. అందరి చేత ప్రమాణం చేయించినారు.

ఈ కార్యక్రమములో బి కే అరుణ అక్కయ్య, బి కే రాధిక అక్కయ్య, బి కే అన్నపూర్ణ అక్కయ్య, అయినవోలు సాంబశివరావు ,శనగపల్లిపుల్లారావు మరియు బ్రహ్మకుమారీలు, బ్రహ్మ కుమారులు పాల్గొన్నారు.

See also  దివ్యాంగుల ఉద్యోగస్తులకు బయోమెట్రిక్ విధానం తీసివేయాలని డిమాండ్