బీసీలకు అన్యాయం చేసిన సీబీఐ దత్త పుత్రుడు : గుంటూరు నగర జనసేన అధ్యక్షులు నేరేళ్ళ సురేష్

   గుంటూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు అన్యాయం చేసిన సీబీఐ దత్త పుత్రుడికి ఈసారి ఓటమి ఖాయమని గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు పదవులు కాదని చంద్రబాబు అనుచరుడయిన కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడమేంటి?అడిగేవారు లేరని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. ఈసారి మీకు ప్రజలు ఓట్ల రూపంలో సరయిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. ఒకప్పుడు గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆర్. కిష్ణయ్యకి సంబంధాలు ఉన్నాయని మీరు విమర్శించిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇంతకన్న సిగ్గులేని రాజకీయం ఇంకొకటి లేదని ఎద్దేవ చేశారు.

See also  రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్