ఎరుకోండ గ్రామంలో ప్రజలతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

నెల్లిమర్ల, నవంబర్ 12, (జనస్వరం): నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటి రేగ మండలం లోని ఎరుకోండ పంచాయతీ పరిధిలో నిర్వహించిన “మన ప్రజలతో – మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని, వారి సమస్యలు, అవసరాలు మరియు గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలు, పారిశుద్ధ్యం లోపం, కాళువలు మూసుకుపోవడం, వీధి దీపాలు పనిచేయకపోవడం, కరెంట్ స్తంభాల మరమ్మతులు వంటి అంశాలను వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సంబంధిత అధికారులను ఆదేశించి, గ్రామంలో శుభ్రత చర్యలు చేపట్టాలని, డ్రైనేజ్ మరియు కాళువలను శుభ్రం చేయాలని, వీధి దీపాలు, కరెంట్ స్తంభాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. ప్రజలకు శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధి దిశగా కృషి చేస్తున్న లోకం నాగ మాధవి ప్రజాసేవా నిబద్ధత అందరి ప్రశంసలను అందుకుంది.

See also  రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ : జనసేన నాయకులు మర్రాపు సురేష్