శ్రీకాళహస్తిలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం

శ్రీకాళహస్తి

            శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 46 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు  శ్రీరామ్ నగర్ కాలనీలోని వీధుల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు వల్ల పట్టణంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు మహిళలు తెలిపారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ బిల్లులు, గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి నాయకులు రవి కుమార్ రెడ్డి, చలమయ్య, నితీష్ కుమార్, చందు చౌదరీ, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తి వైసీపీ నుండి జనసేనలో చేరికలు