సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించిన కాపు శంభం గ్రామ జనసైనికులు

కాపు శంభం

          చీపురుపల్లి ( జనస్వరం ) : గరివిడి మండలం, కాపు శంభం గ్రామంలో గత కొంతకాలంగా చెత్త కాలువల్లో నిల్వ ఉండటం వలన గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచి నీటి సమస్య కొరత ఉందనే విషయం తెలుసుకొని కాపు శంభం గ్రామ జనసైనికులు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి  వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బాకూరి శ్రీను, చందక బాల, ముల్లు జగదీష్, శ్రీరామ్, గణేష్, ప్రశాంత్, నాని, అశోక్  పాల్గొన్నారు. 

See also  కోనసీమ జిల్లా అమలాపురం ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డి