బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో జనసేన తోడ్పాటు : రామా శ్రీనివాస్

రామా శ్రీనివాస్

        రాయచోటి ( జనస్వరం ) : డైట్ ఉన్నత పాఠశాలలో జరిగిన వికలాంగుల దినోత్సవం శుభ సందర్భంగా అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకులు రామా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో తోడ్పాటు, చేయూత ఇస్తామని వికలాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు విసిగిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్లు తొలగించడంపై ఆయన మండిపడ్డారు… ఈ కార్యక్రమంలో వికలాంగులు ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

See also  నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పార్టీ నుండి మొత్తం 54 వార్డులలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాం - జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్