ఆలయ ధర్మకర్తగా అన్యాయం జరిగిన వట్టికూటి వీర రాఘవమ్మకు అండగా జనసేన వీర మహిళలు

ఆలయ ధర్మకర్తగా అన్యాయం జరిగిన వట్టికూటి వీర రాఘవమ్మకు అండగా జనసేన వీర మహిళలు

                 జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల గ్రామం సింగనమ్మ చింత నందు నెలకొన్న ఆలయానికి ధర్మకర్తలు ఆస్థాన ఆసాదులు అయినటువంటి పసుపులేటి వారి సంతానం వారు నలుగురు. అందులో ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించి ప్రథమ పుత్రిక అయిన వట్టికూటి వీర రాఘవమ్మ గారికి ఎటువంటి అవకాశము కల్పించకుండా వారిని అక్కడ ఆ ఆలయం నుండి మరియు పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం నుండి దూరం చేయడం కోసం గ్రామ పెద్దలు పంచాయితీ సమావేశం నిర్వహించారు.  వీరుని సమీపాన రామాలయం నందు మీటింగ్ ఏర్పాటు చేసి వారిని రమ్మని పిలిపించడం వివరించడం జరిగింది.  శ్రీమతి వీర రాఘవమ్మ గారి కుమార్తె జనసేన వీరమహిళ వట్టికూటి సీతా మహాలక్ష్మి గారు ఈ విషయం  కాకినాడ మాజీ మేయర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబెర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారికి తెలియజేయగా, విషయాన్ని తెలుసుకొని  తన ధర్మపోరాటం వెనుక వీరమహిళలం అందరం మీకు తోడుగా నిలబడతాం అని,  కొందరి వీరమహిళలతో కలిసి మీ పంచాయతీ పెద్దలతో చర్చించే సమయమున మీతో నిలబడతాం అని భరోసా ఇవ్వడం జరిగింది. అదే విధంగా వారి దగ్గరకు వెళ్లి, ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని అలాగే వీరమహిళలు పిల్లా రమ్యజ్యోతి ,పెంకే వెంకటలక్ష్మి, జ్యోతి దాలే ద్వారా వారి కుటంబానికి ధైర్యాన్ని అందించి చర్చ జరిగే సమయంలో వారికి తోడుగా మరియు గ్రామ పంచాయతీలో విజ్ఞతతో ఎటువంటి గొడవలు కాకుండా వ్యవహరించి పూర్తి భరోసా వీరమహిళ వట్టికూటి సీతామహాలక్ష్మీ గారికి కావాల్సిన సహకారాన్ని దగ్గర ఉండి చేస్తాం అని వారి కుటంబానికి అభయం అందించడం జరిగింది.

See also  కట్టడానికి నిధులు లేవు - కట్టిన వాటికి దిక్కులేదు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి