చిట్టినగర్ కొత్త అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

పోతిన మహేష్

               విజయవాడ, (జనస్వరం) : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ లో వెలసిన నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో బాలాత్రిపురసుందరిదేవి రూపంలో అమ్మవారిని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి ప్రెసిడెంట్ లింగిపిల్ల.అప్పారావు, సెక్రటరీ మరుపిల్ల. హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ.శ్రీనివాస్, కమిటీ సభ్యులు మహేష్ ని ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ప్రాంగణం లో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అర్బన్ నాయకులు, ధార్మిక సేవ మండలి సభ్యులు కొరగంజి రమణ, వేవిన నాగరాజు, తమ్మిన రఘు, శివరామకృష్ణ, దుర్గా రాణి, బొట్ట సాయి, మూర్తి, కొండ, పొట్నురి శ్రీను, సోమశేఖర్, నూకరాజు,వెంకటేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  అద్దంకి జనసైనికుల ఆర్థిక సహాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి