ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS చేస్తున్న పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు

జనసేన

            రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో భాగంపల్లి గ్రామపంచాయతీ కుప్పగుట్టపల్లిలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS నాయకులు మహాదేవ, MSP నాగరాజ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రకు జనసేనపార్టీ తరపున మద్దతు తెలపడం జరిగింది. జనసేన నాయకులు రామ శ్రీనివాస్, అంబేడ్కరీస్ట్ ఫలం నాగేంద్ర జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పార్టీల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ లో పలువురు రాజకీయ నేతలు, రామంజులు, విశ్వనాథన్ నాయక్, మనోహర్, యువకులు,గ్రామస్థులు,ప్రజలు పాల్గొన్నారు.

See also  ప్రమాదవశాత్తులో ఏడు ఇల్లులు దగ్ధం, జనసేన నాయకుల సహాయం