జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

జనసేన

              కడప ( జనస్వరం ) :  రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక మిషన్ పాఠశాల లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర 49వ జన్మదినం పురస్కరించుకొని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు చిట్వేల్ మండల జనసైనికులు మాదాసు నరసింహ, హరి రాయల్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా రక్షణ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 35 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, నాపై అభిమానంతో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మాదాసు నరసింహ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాగేంద్ర అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కలియుగ వైకుంఠ నాథుని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నామని ఈ సందర్భంగా చిట్వేలు మండలం జనసేన తరపున ఆయన తెలియజేశారు.

See also  తిరువూరు నియోజకవర్గంలో మెగా యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం