అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు వాసగిరి మణికంఠ

జనసేన

        గుంతకల్ ( జనస్వరం ) : ఇటీవల కాలంలో గుంతకల్ పట్టణ జనసైనికుడు కావాలి రవి కుమార్ అకాల మృతి చెందాడు. పిల్లల చదువుకు చేయూతగా 13వ వార్డు జనసేన పార్టీ ఇన్చార్జి బండి శేఖర్ సమక్షంలో పుస్తకాల సామాగ్రి మరియు 10 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం వాసగిరి మణికంఠ అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా కావాలి రవి కుమార్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. రవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో అండగా ఉన్నందుకు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ చిరంజీవి యువత పాండు కుమార్, జనసైనికులు సూర్య నారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

See also  భవిష్యత్ నాయకులను తయారు చేయడమే లక్ష్యం : యుగంధర్ పొన్న