అగ్నిప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన కుటుంబానికి సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పెదనాగయ్యపాలెం పంచాయితీలో గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో బొడ్డు నర్సింగ్ కుటుంబం ఇల్లు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ కిరణ్ చిన నాగమయ్యపాలెం జనసైనికుడు బొడ్డురాజుకు  తెలిపారు. ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలన్న సంకల్పంతో విద్యార్థి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తో కిరణ్ మాట్లాడి వారి ద్వారా ఈ పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరం అయిన అన్ని వస్తువులను ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయపడిన ఆ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. అదే విధంగా పంచాయితీలో పని చేసిన ప్రతీ యువకులకు మరియు జన సైనికులు కూడా కొంత వరకు సహాయపడటం జరిగింది. సహాయం అందించిన అందరికీ బొడ్డు నర్సింగ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

See also  తక్షణమే ఎతైన వంతెన నిర్మాణ మరమ్మతులు చేపట్టాలి : రాజంపేట జనసేనపార్టీ నాయకులు