కనకదుర్గమ్మ గుడిలో శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో జరపాలని వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పోతిన మహేష్

కనకదుర్గమ్మ గుడిలో శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో జరపాలని వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పోతిన మహేష్

         గొల్లపూడిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జున్ రావు ఐఏఎస్ గారిని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ రోజు వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహేష్ కమిషనర్ గారితో మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 4 కోట్ల రూపాయల విలువైన శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం కాకుండా ఈ టెండర్ ద్వారా పారదర్శకంగా టెండర్లు కేటాయించాలని గత కమిషనర్ గారి ఆదేశాలను కూడా బేఖాతర్ చేస్తూ ఈవో సురేష్ బాబు టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిపై ఇవ్వడంపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి విగ్రహాలు మాయంపై ప్రత్యేక దృష్టి సారించి అమ్మవారి భక్తుల మనోభావాలను కాపాడాలని, బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్న సురేష్ పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో పిళ్ళ.శ్రీనివాస్, బొమ్మ రాంబాబు, అమీర్ భాషా పాల్గొన్నారు.

See also  రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ వద్ద బటన్ నొక్కి - బటన్ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి