రణస్థలం మండలంలో పూరిళ్ళు దగ్ధం, ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

             ఎచ్ఛర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలంలోని JR పురం పంచాయితీ,సీతంవలస, గోలపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 8 పూరిల్లు దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతిశ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలుకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీమతి క్రాంతి శ్రీగారు మాట్లాడుతూ మీకు నేను ఉన్నాను అని భరోసా నిచ్చి, అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మినాయుడు గారు, గురిజా. శ్రీనివాస్ రావు గారు, MPTC అభ్యర్థి రాజారమేష్ గారు, కాకర్ల.బాబాజీ , అప్పలకొండ, నవీరి,రాజు, రాజేష్, రమణ లంకలపల్లి.రమణ, సాయి, జయప్రకాశ్, అలాగే గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.

See also  మాజీ మంత్రి అనిల్ మాటలు నెల్లూరు ప్రజలు వినీ వినీ ప్రజలు విసుగెత్తిపోయారు