
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు అక్కల రామమోనరావు గాంధీ
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి మరియు జక్కంపూడి కాలనీలో(YSRకాలనీ) కృష్ణ అనే వ్యక్తి కి కిడ్నీలు రెండు పాడు అయిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మైలవరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ అక్కల రామమోనరావు గాంధీ గారికి కృష్ణ గారి కుటుంబ సభ్యులు రెండురోజులు క్రితం తెలియజేసారు. ఆ విషయం జనసేన పార్టీ నాయకులుబొలిశెట్టి శ్రీకాంత్కి గాంధీగారు సమాచారం అందించారు. ఈరోజు శ్రీకాంత్ గారు వైస్సార్ కాలనికి వెళ్లి కృష్ణ గారి కుటుంబ కుటుంబానికి 5000 వేల రూపాయలు నగదు మరియు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు, బియ్యం 25 కేజీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీకాంత్, కోలా రాజు, యార్రంశెట్టి నాని, వెంకీ, పవన్, అరవింద్, రమేష్ నాగబాబు-మరియు జనసేనాపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








