పాము కాటుకు గురైన బాధితుడికి జనసైనికుల ఆర్థిక సహాయం

పాము కాటుకు గురైన బాధితుడికి జనసైనికుల ఆర్థిక సహాయం. 

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఇండుగపల్లి గ్రామంలో జనసేన కార్యకర్తలు పాము కాటుకు గురైన వ్యక్తికి  ఆర్థిక సహాయం చేసారు. దారకొండ నగేష్ తన పశువులను మేతకు చెనుకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో తనని ఒక పాము కాటు వేసింది. కుటుంబ పెద్ద అయిన నగేష్ మీదే జీవనాధారం ఆధారపడి ఉన్నారు. ఇపుడు నగేష్ కు పాము కాటు వేయడంతో తమ కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారింది. ఇంట్లో పూట గడవడం కష్టం అయింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ యువ కార్యకర్తలు, గ్రామ పెద్దలు కలిసికట్టుగా కలసి 1000 రూపాయలు, 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు రామ్, నక్కా లవకుమార్, గుడివాడ వరప్రసాద్, అల్లు వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.. జనసేన నాయకుడు రామ్ మాట్లాడుతూ మా గ్రామంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా ఇలాగే కలసి కట్టుగా ఉండి సహాయం చేస్తామని, అలాగే సమస్యలపై పోరాడటానికి కూడా జనసేన తరుపున ముందుగా ఉంటామని చెప్పారు.

See also  పవనన్న ప్రజాబాటకు విశేష ప్రజాస్పందన