సుదీర్ కుటుంబానికి ప్రమాద భీమా సహాయాన్ని అందించిన జనసేనపార్టీ

బొబ్బిలి, అక్టోబర్ 23, (జనస్వరం) :బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కీ.శే సుదీర్ పాము కాటు కారణంగా అకాలమరణం చెందడం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో సుదీర్ కుటుంబానికి అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ నాగబాబు తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సుదీర్ కుటుంబంతో పాటు కింతాడ కృష్ణ కుటుంబానికి కూడా ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. సుదీర్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడని, అతని సేవలు మరువలేనివని నాయకులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు చేయూత అందించడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు పాలూరు, తెర్లం మండల అధ్యక్షుడు మరడాన రవి, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి పెంట శంకర్ రావు, జనసేన కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

See also  లోకం మాధవికి వినతిపత్రాన్ని అందించిన ప్రభుత్వ ఉద్యోగులు