అకాల మరణం చెందిన జనసైనికుడి కుటుంబానికి రూ.32000 ఆర్థిక సహాయాన్నిఅందించిన జనసేన నాయకులు

జనసేన

             చీపురుపల్లి ( జనస్వరం ) : మెరకముడిదాంలో రేగిడి రాము జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొద్దిరోజులు క్రితం అకాల మరణం చెందారు. స్థానిక జనసేన నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధర్యాన్ని ఇచ్చారు. జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ జనసేన సైనికులు అందరూ కలిసి NRI లు  కలసి ఇచ్చిన సహాయం 32000వేలు చెక్కును రేగిడి లక్ష్మణ బంటుపల్లి శంకరరావు మరియు స్థానిక జడ్పీటీసీ కాండిడిట్ సాసుబిల్లి రామునాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ కుటంబానికి అందచేయ్యడం జరిగింది. వారి ఇద్దరు పిల్లలకు సరిపడా చదువు నిమిత్తం పుస్తకాలు కిట్టును అందచేయ్యడం జరిగింది. అంతేకాకుండా పిల్లల చదువు పూర్తి అయినంతవరకు పుస్తకాలను పూర్తిగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిగ తవిటినాయుడు, సిగ రమణ, చీపురుపల్లి కిరణ్ కుమార్, దేబార్కి మోహన్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

See also  మంగళంపేట అటవీ ఆక్రమణపై చర్యలు వేగం, భూములు స్వాధీనం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి