టీడీపీ నాయకులను మార్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

టీడీపీ

          చంద్రగిరి ( జనస్వరం ) : చిత్తూరుజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పిలుపుమేరకు జనసేన చంద్రగిరి నియోజకవర్గం తరఫున జనసేన నాయకులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా  కలిశారు. వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి, కార్యచరణ, కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు. అన్ని విధాలుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున సహకరిస్తామని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ 6 మండలాల అధ్యక్షులు రాయల్ వెంకట్, గురునాథ తలారి, జస్వంత్, కిషోర్, జనసేన సాయి, మురళి జిల్లా కమిటీ సభ్యులు ఎం.నాసిర్, బీగాల అరుణ, కలప రవి పాల్గొనడం జరిగింది.

See also  జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన రాజోలు జనసేన నాయకులు