గుండెపోటుతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఇన్ఫినిటీ ట్రస్ట్ సాయం

అనంతపురం, ఫిబ్రవరి 24, (జనస్వరం) : పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఓ యువ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణమ్మ స్పందించి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్‌ను సంప్రదించారు. పరిస్థితిని తెలుసుకున్న బద్దె నాయక్ తక్షణ సహాయంగా రూ.10,000ను మృతుడి భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాలతేజ యాదవ్, ఇన్‌చార్జి రాజు, టిడిపి కార్యకర్తలు అంజలి, మనీషా, సుభాష్ యాదవ్, స్టోర్ డీలర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

See also  ప్రభుత్వ బాలికల వసతి గృహాలలో తీవ్ర మౌలిక సదుపాయాల కొరత