
నిరుపేద వృద్దులకు వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయండి : జనసేన నాయకులు
ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య పెన్షన్లను అర్హులైన అనేకమంది వృద్ధులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం సబ్ కలెక్టర్ సూరజ్ గనోరెకు జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు వినతపత్రం అందజేశారు. టెక్కలి మేజర్ పంచాయతీ నందు గొడగల వీధికి చెందిన, అంగవైకల్యం, మానసిక వ్యధలతో బాధపడుతున్న ఐదుగురు వృద్దులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చెంతకు తీసుకెళ్లి వారితో తమ మొర విన్నవించారు. అందరితో స్వయంగా మాట్లాడిన కలెక్టర్ వారికి పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, హనుమంతు దిలిప్ పాల్గొన్నారు.








