వేసవి తాపం నుండి ఉపశమనం పొందండి : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

     విజయనగరం, (జనస్వరం) : ఒక్కసారిగా రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో, విజయనగరంలో 42వ డివిజన్, కామాక్షినగర్లో మజ్జిగ చలివేంద్రాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విపత్తుల శాఖ ఈ నెలాఖరువరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించటంతో ప్రజలందరూ బయటకు వచ్చేటప్పుడు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఎక్కువగా మంచినీటితో పాటు, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసం వంటి పానీయాలు తాగి వేసవినుంచి ఉపశమనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిరాజ్ చౌదరి, ఎర్నాగుల చక్రవర్తి, 42వ డివిజన్ నాయకులు, వై. నల్లమరాజు, కనితి సురేష్, అప్పలనాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

See also  జగన్ కేసులు మాఫీ చేసుకునేందుకు ఢిల్లీ పర్యటనలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు : డా. మైఫోర్స్ మహేష్