స్థానిక ఎన్నికలకు పోరుకు సిద్ధం అవ్వండి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

              కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ  ఆంధ్ర రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ఎమ్మిగనూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు సిద్ధం కావాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ 2019 తర్వాత జరగబోయే మొట్టమొదటి స్థానిక పోరులో జనసేన పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు కృషిచేయాలని ఎమ్మిగనూరు మండలం లో ఉన్న 16 పంచాయతీలో జనసేన జెండా పాత విధంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్లాలని జనసేన సత్తాని చాటి చెప్పాలని కోరారు.

See also  పోలవరం వంతెన నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలి : అక్కల రామమోహనరావు (గాంధీ)