
పాతపట్నం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ గేదెల చైతన్య
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల చైతన్య గారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొదటి సభ్యత్వం వీరమహిళ సిరిపురం గాయత్రి గారికి అందించడం జరిగింది. కార్యాక్రమంలో చైతన్య గారు కార్యకర్తలతో సమావేశమై ఈరోజు నుంచి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంబించాం అని తెలిపారు. ఈ ఆన్లైన్ ప్రాసెస్ జిల్లాలో మొదటిగా పాతపట్నం నియోజకవర్గంలో ప్రారంభమైందని, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపి యాప్ ప్రాసెస్ ని వివరించారు. కార్యక్రమంలో గురుప్రసాద్ , వినోద్ , సురేష్ , సాయి ప్రతాప్ , బుజ్జి ప్రదీప్ రాము పాల్గొన్నారు.









