విజయనగరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న గాజులరేగ “చిరంజీవి యువత”

విజయనగరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న గాజులరేగ “చిరంజీవి యువత”

                   జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను గాజులరేగకు చెందిన జిల్లా చిరంజీవి యువత సభ్యులు ఓ ఇరవై మంది జిల్లా చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ చెల్లూరి ముత్యాల నాయుడు నేతృత్వంలో తీసుకున్నారు. వీరందరికీ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కోసం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించారని, దీనితో పాటుగా పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నిబద్ధతతో ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం వస్తుందని అన్నారు. ఈ క్రియాశీలక సభ్యత్వాలకు స్పందన ప్రజల్లో చాలా బాగుందని, ఈసభ్యత్వాలను జనసైనికులు, ఝాన్సీ వీరమహిళలు, మెగాఫ్యామిలీ అభిమానులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవియువత సభ్యులు బూడివాసు, బూడిప్రసాద్, లెంకనాగార్జున, శీరకుమార్, జడ్డు జనా, శివకుమార్, నడిపిల్లి ముత్యాల నాయుడు, R.నాగరాజు, Ch.స్వామి, వంశీ, లక్ష్మణ్, రామకృష్ణ గాడి రాజు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

See also  అర్హత ఉండి పథకాలు పొందని లబ్ధిదారులకు అండగా నెల్లూరు జనసేన నాయకులు