జనసేన ఆద్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం

జనసేన

    తెలంగాణ ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆద్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. మలివిడతలో భాగంగా సురభి కాలనీ వాసులకు కళ్ళ జోళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కంటి పరీక్షలు నాణ్యత లేక సరైన సమయానికి కంటి అద్దాలు అందించకపోవటం వల్ల కంటి సమస్యలు అధికమవుతాయి అని తెలియచేశారు. కానీ మాధవ రెడ్డి ఈ సేవా కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి సకాలంలో కంటి అద్దాలు అందించటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పర్యవేక్షణ కమిటీ మెంబర్ సురేష్ రెడ్డి, అరుణ్, ప్రదీప్, జి.ఎస్.కె శ్రావణ్, ప్రశాంత్, కళ్యాణ్ చక్రవర్తి, ప్రవీణ్ సాహు, జయానంద్, రోహిత్ రెడ్డి, ఉపేంద్ర, కామరాజు, నాగరాజు ఇతర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

See also  ప్రజల దాహార్తి తీర్చి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి