దివ్యాంగులకు ట్రై సైకిల్లు ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) :  బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ 2019 డిసెంబర్లో బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో దివ్యాంగుల ఉపకరణాల క్యాంపులను ఏర్పాటు చేయడమైనది. ఈ క్యాంపు ఆల్ ఇన్కో పౌండేషన్ ఎంపీ  నిధులతో ఉపకరణాలు తీసుకువచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కూడా ఆ ఉపకరణాలు పంపిణీ చేయలేదు. శిధిలావస్థలో ఉన్న ఉపకరణాలని ఎంపీ నందిగామ సురేష్ వెంటనే పంపిణీ చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, షేక్ సుభాని, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

See also  7వ రోజుకి చేరిన ఆశా వర్కర్ల రిలే దీక్షలు, దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన