ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం : జనసేన నాయకులు మనుబోలు గణపతి

జనసేన

         నెల్లూరు ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గం, లింగాయపాలెం గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు కరపత్రాలు పంచుతూ పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి ప్రస్థానాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగింది. గ్రామస్థులు మాట్లాడుతూ వైసీపీ పాలనపై అసంతృప్తి గా ఉన్నామని ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో తమ మద్దతు జనసేన పార్టీకే అని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళహస్తి గిరిధర్, తాండ్ర శ్రీను, శశి వర్ధన్ పాల్గొన్నారు

See also  జనసైనికుని వినూత్న ప్రయత్నం - జనసేనాని అభినందన