
హిందూపురం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అదేశాలమేరకు హిందూపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సభ్యత్వం మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. సభ్యత్వం రుసుము 500 రూపాయలు నేరుగా పార్టీ ఆఫీసుకు ఆన్లైన్ ద్వారా చెల్లింపబడుతుంది. ఈ సభ్యత్వం చేసుకొన్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మరియు 50 వేల రూపాయల ఆరోగ్య భీమా వర్తింప చేయబడుతుంది. కార్యకర్తల శ్రేయస్సును కోరుకొంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రతి జనసేన కార్యకర్త మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియొగం చేసుకోవాలని ఆకుల ఉమేష్ గారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లెపూల మధు, మంజు, చక్రి, శేఖర్, రామంజి, భాస్కర్, కిషోర్, విజయ్, సతీష్, నాగభూషణం, నవీన్, ప్రభు, సునీల్, కుమార్, శివ, హనుమంతు మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








