గుడివాడ అమర్నాథ్ దిష్టిబొమ్మను తగులబెట్టిన భీమిలి జనసేన నాయకులు సందీప్ పంచకర్ల

       భీమిలి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన మంత్రిత్వ శాఖ పనులు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం మానేసి కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని, తన శాఖ అయిన ఐటి శాఖకి సంబంధించి ఒక్క ఐటీ కంపెనీ కానీ, కొత్త పరిశ్రమలు కానీ ఆంధ్ర రాష్ట్రం తీసుకురాకుండా, సిగ్గు లేకుండా జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అలానే సంస్కారం లేకుండా పెద్దలు అనే గౌరవం లేకుండా హరిరామ జోగయ్యని తక్కువ చేసి మాట్లాడం సిగ్గు చేటు అని, తక్షణమే వారికి క్షమాపణ చెప్పి, జగన్ ఆడించే తోలుబొమ్మలా ఆడుతూ తన గొయ్యి తానే తవ్వుకుంటు బలి పశువు అవుతున్నావు అని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో మంత్రి దిష్టి బొమ్మకు నిమ్మకాయలు కట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శాఖరి శ్రీనివాస్, బీవీ కృష్ణయ్య, ఓమ్మీ దేవి యాదవ్, భీమిలి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  గుంతకల్లు నియోజకవర్గ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం